28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ట్రాక్టర్ కిందపడి బాలుడు దుర్మరణం

22-11-2025 09:24 PM

అలంపూర్: తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబలించింది. ఈ ఘటన గద్వాల జిల్లా మానపాడు మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రానికి చెందిన బోయ విష్ణుకుమార్ పార్వతీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

అందులో చిన్న కుమారుడు కార్తీక్ నాయుడు(4) ఉదయం పిల్లలతో కలిసి ఆడుకుంటున్న క్రమంలో వ్యవసాయ పనులకు సంబంధించిన ట్రాక్టర్ ను డ్రైవర్ రివర్స్ తీస్తుండగా.. ట్రాక్టర్ వెనకాల ఉన్న కార్తీక్ ను తగిలింది.  దీంతో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సరదాగా పిల్లలతో కలిసి ఆడుకుంటున్న తమ కుమారుడు ప్రమాదానికి గురై చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.