13 June, 2026 | 1:57 PM

Breaking News

అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •  

నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి: కలెక్టర్

11-10-2025 01:57 AM

నకిరేకల్ అక్టోబర్ 10 (విజయక్రాంతి) ప్రభుత్వం సూచించిన నాణ్యత ప్రమాణాల తో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిరైతులనుకోరారు .శుక్రవారం  నకిరేకల్ మండలం తాటికల్ లో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఆమె  తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకురావాలని, తేమ తాలు ,తరుగు,చెత్త,చెదారం  వంటివి లేకుండా  పూర్తి నాణ్యతతో తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సహకరించాలని ఆమెకోరారు. రాష్ర్ట ప్రభుత్వం వరికి క్వింటాల్ కు  2389 /- రూపాయల మద్దతు ధర ప్రకటించిందని, ఈ ధరను  పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు ఆమెఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని పరిశీలించి తూర్పార బట్టించి, తేమ ,తాలు లేకుండా చూసుకోవాలని, నాణ్యతతో ఉన్న  ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. ఆమె వెంటజిల్లా సహకార అధికారి పత్యానాయక్, ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి, జిల్లా పారసరఫరాల అధికారి వెంకటేశం, నకిరేకల్ తాహశీల్దార్ యాదగిరి ,ఏడిఏ జానీ మియా ,పిఎసిఎస్ సీఈవో జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.