13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ

08-01-2026 12:18 AM

యువత భవిష్యత్తును కాపాడుకోవాలంటూ పిలుపు

శేరిలింగంపల్లి, జనవరి 7 (విజయక్రాంతి): డ్రగ్స్ మత్తుకు బానిసై యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేస్తూ డ్రగ్స్కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని, చదువు, ఉపాధి, క్రీడలపై దృష్టి పెట్టి దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆయన కోరా రు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, యువత అందరూ కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ర్యాలీలో పాల్గొన్న నేతలు పిలుపునిచ్చారు.