24-10-2024 12:00:00 AM
హైదరాబాద్సహా రాష్ట్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలవల్ల ప్రజలకు మేలు జరగాలని కోరు కుందాం. అనేకచోట్ల ఆహార పదార్థాలలో నాణ్యతా ప్రమాణాలను పాటించక పోవడం, సరైన పరిశుభ్రత లేకపోవడం వంటి సంఘటనలు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆరో గ్యకరమైన ఆహారాన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంచేందుకు కట్టుబడి ఉండడం అభినందనీయం. ఇప్పటికైనా, వ్యాపారులు నాణ్యత పెంపునకు ప్రాధాన్యమివ్వాలి. నిబంధనలు పాటించడం ద్వారా వారు తమ కస్టమర్లపై నమ్మకాన్ని పొందగలరు.
-డా. చిట్యాల రవీందర్, మణికొండ