30 August, 2026 | 6:47 PM

Breaking News

సమాజ ప్రగతికి యువత తమ ప్రతిభను వినియోగించాలి   •   మాజీ ఎంపీపీ జగన్ మోహన్‌రావుకు పరామర్శ   •   అఖండ జ్యోతి కార్యక్రమంలో ఆలరించిన పల్లి గ్రామ భక్తులు   •   కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు జిల్లా అధ్యక్షుని కృషి   •   భగవద్గీత శ్లోక పఠన పోటీలకు విశేష స్పందన   •   ఎంఎస్‌పీ గణపురం మండల అధ్యక్షుడిగా నాగరాజు   •   నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వాలు   •   మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం ఆపన్నహస్తం   •   48గంటల రిలే నిరాహార దీక్ష పోస్టర్ ఆవిష్కరించిన గొండ్వాన సంక్షేమ పరిషత్   •   జగన్నాధపురంలో ‘గ్రోమోర్’ కేంద్రం ప్రారంభించిన సర్పంచ్ వినోద్   •  

సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల

14-05-2025 12:00 AM
  1. 10, 12వ తరగతుల్లో బాలికలదే పైచేయి
  2. విజయవాడ రీజియన్‌దే హవా

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) మంగళవారం 10, 12వ తరగతుల ఫలితాల ను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. పది ఫలితాల్లో 93.66 శాతం మంది వి ద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 93.60 శాతం సాధించగా ఈసారి 0.06 ఉత్తీర్ణత శాతం పెరిగింది.

23,71,939 మంది పరీక్షలు రాస్తే 22,21,636 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 95 శాతం, బాలురు 92 శాతం, ట్రాన్స్ జెండర్ 95 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి ఫలితాల్లో విజయవాడ రీజియన్ సత్తా చాటింది. 99.79 శా తంతో విజయవాడ, త్రివేండ్రం అగ్రస్థానంలో నిలిచాయి. 

12వ తరగతి ఫలితాల్లోనూ బాలికలే..

12వ తరగతి ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 91.64 శాతం, బాలురు 85.70 శాతం, ట్రాన్స్‌జెండర్ వంశాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు 16,92,794 మంది హాజరుకాగా, 14,96,307 (88.39 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పో ల్చుకుంటే 0.41 శాతం పెరిగింది. 12వ తరగతి ఫలితాల్లోనూ విజయవాడ రీజియన్ సత్తా చాటింది. 99. 60 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 99.32 శాతంతో త్రివేండ్రం ద్వితీయ స్థానంలో నిలిచాయి.