21 April, 2026 | 5:47 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

నేటి నుంచి సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్

13-09-2025 03:00 AM

గ్రూప్-2 మూడో విడత తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ప్రకటిచింది. సెప్టెంబర్ 13న(శనివారం) ఉదయం 10ః30 గంటల నుంచి హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ తెలిపింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యాక సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్‌లో ఉంటే వాటిని సెప్టెంబర్ 15న ఇవ్వాలని పేర్కొంది. మొత్తం 783 పోస్టులకు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జాబితాను https://www.tgpsc.gov.in వెబ్‌సైట్‌లో ఉంచినట్టు టీజీపీఎస్సీ పేర్కొంది.