16 April, 2026 | 11:06 AM

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్

05-11-2025 04:41 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలం పునకల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి ప్రారంభించారు. వరి పండించిన రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.