27 July, 2026 | 7:51 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శ

05-11-2025 06:23 PM

అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం మండల మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి సతీమణి లక్ష్మమమ్మకు ఇటీవల మోకాలి చికిత్స జరిగిన విషయం తెలుసుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు బుధవారం ఆమెను పరామర్శించారు. లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మాట్లాడిన ఆయన, మనమందరం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా నేను ముందుండి సహాయం చేస్తానని భరోసా కల్పించారు. పరామర్శ సమయంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనతో పాటు ఉన్నారు.