17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గోదావరి తీరాన కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో..

05-11-2025 06:37 PM

అశ్వాపురం (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం అశ్వాపురం మండలంలోని చింతిర్యాల గ్రామ గోదావరి నది తీరాన ఉన్న పురాతన శివాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేసి భక్తిభావంతో నిండిపోయారు. మహిళలు ప్రత్యేకంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో దీపాలు వెలిగించి, వత్తులతో కూడిన దీపాలను గోదావరి నదిలో సమర్పించారు.

కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపం వెలిగించడం ద్వారా పుణ్యం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తుల రాకపోకలతో ఆలయం పరిసరాలు కిక్కిరిసిపోయిన నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. గోదావరి తీరం, ఆలయానికి వెళ్లే మార్గాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.