05-11-2025 06:30:28 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ బి నగర్ లో ఉన్న ఇష్ట కార్యసిద్ధి ఆంజనేయస్వామి క్షేత్ర ఆవరణలో బుధవారం అనంత పద్మనాభ స్వామి మండప నిర్మాణానికి భూమి పూజాకార్యక్రమం ప్రముఖ వేదపండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇష్ట కార్య సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు అయిత బాలకిషన్, కమిటీ ప్రతినిధులు డాక్టర్ చారి, సత్యనారాయణ, నిత్యానందం, సూర్యకాంతరావు, తదితరులు పాల్గొన్నారు.