17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

భూభారతితో సాదా బైనామా సమస్యకు చెక్

08-05-2025 12:00 AM

నల్లగొండ, మే 7 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనమా, పిఓటి వంటి సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కల్పించిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం నకిరేకల్ మండలం చందనపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.

భూములకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే రాష్ట్రప్రభుత్వం పైలెట్ మండలం నకిరేకల్  గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల లో దరఖాస్తులు ఇవ్వాలని ఆమె చెప్పారు. భూముల సమస్యలపై గతంలో నిర్వహించిన 4 పైలెట్ మండ లాలు మినహాయించి  ప్రస్తుతం 28 జిల్లాలలో ఒక పైలెట్ మండలాన్ని ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ఆదేశించడం  జరిగింది.

ఇందులో భాగంగా ఈ నెల 5 నుండి తిరిగి జిల్లాకు ఒక పైలట్ మం డలంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి అక్కడి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నది. నల్గొండ జిల్లాకు సంబంధించి నకిరేకల్ మండలాన్ని పైలట్ మండలంగా తీసుకోగా, ఈ నెల 5 నుండి ఆ మండలంలోని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది. నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తదితరులు రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు.