27 July, 2026 | 6:56 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

పీఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శిగా చింతకాయల పుల్లయ్య

31-10-2025 05:50 PM

నకిరేకల్,(విజయక్రాంతి): కట్టంగూరు మండలంలోని చెర్వు అన్నారం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న చింతకాయల పుల్లయ్య పి ఆర్ టి యు టీఎస్ కట్టంగూర్ మండల శాఖ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి జ్ఞాన ప్రకాష్ రావు  మండల విద్యాధికారి అంబటి అంజయ్య గార్లను మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిసి పూలబొకే అందించారు. ఈ సందర్భంగా వారు చింతకాయల పుల్లయ్యను శాలువాతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపర్డెంట్ చలపతి ,మండల ఏపీవో కడియం రామ్మోహన్, పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చిన్ని శ్రీనివాస్, విట్టల్, కట్టంగూరు మండల శాఖ అధ్యక్షులు నిమ్మనగోటి వెంకటరమణ,మండల అసోసియేట్ అధ్యక్షులు చెందపాక నరేష్ తదితరులు పాల్గొన్నారు.