12 June, 2026 | 5:32 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

పీఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శిగా చింతకాయల పుల్లయ్య

31-10-2025 05:50 PM

నకిరేకల్,(విజయక్రాంతి): కట్టంగూరు మండలంలోని చెర్వు అన్నారం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న చింతకాయల పుల్లయ్య పి ఆర్ టి యు టీఎస్ కట్టంగూర్ మండల శాఖ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి జ్ఞాన ప్రకాష్ రావు  మండల విద్యాధికారి అంబటి అంజయ్య గార్లను మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిసి పూలబొకే అందించారు. ఈ సందర్భంగా వారు చింతకాయల పుల్లయ్యను శాలువాతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపర్డెంట్ చలపతి ,మండల ఏపీవో కడియం రామ్మోహన్, పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చిన్ని శ్రీనివాస్, విట్టల్, కట్టంగూరు మండల శాఖ అధ్యక్షులు నిమ్మనగోటి వెంకటరమణ,మండల అసోసియేట్ అధ్యక్షులు చెందపాక నరేష్ తదితరులు పాల్గొన్నారు.