17-11-2025 04:32:04 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మానసిక వికలాంగుల కేంద్రంలో పిల్లలకు పండ్లు పంపిణీ చేసి అనంతరం కేకు కట్ చేసి స్వీట్లు పంచడం జరిగింది, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మండల రమేష్, మండల యువజన కాంగ్రెస్ అద్యక్షుడు ఒర్రె అజయ్, కోదాటి కిరణ్, తొగర్రాయి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం అనిల్, చిలుక మల్లేష్, చిలుక శ్రీనివాస్, వినయ్, కళ్లెపెళ్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.