3 April, 2026 | 1:29 PM

Breaking News

బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •   కలెక్టర్ ఆదేశాలు బే ఖాతర్   •   Warangal Sub-Registrar Officeలో సోదాలు.. అక్రమాల గుట్టు విప్పిన ఏసీబీ   •   సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం... గ్రూప్-1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట   •   ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా భూక్యా రవి కుమార్ నాయక్   •   కోనరావుపేట గ్రామసభ రసభస   •  

అదానీ కంపెనీలకు క్లీన్ చిట్

19-09-2025 01:05 AM

హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో నిజం లేదన్న సెబీ

ముంబై, సెప్టెంబర్ 18: గౌతమ్ అదానీ సంస్థలపై అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) గురువారం క్లీన్ చీట్ ఇచ్చింది. అదా నీ కంపెనీలు స్టాక్ అవకతవకలు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతున్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలతో భారీగా పతనం అయిన అదానీ గ్రూప్ షేర్లు తర్వాత నెమ్మదిగా కోలుకున్నాయి.

తాజాగా సెబీ క్లీన్ చిట్ ఇవ్వడంతో అదానీ కంపెనీలకు భారీ ఊరట లభించింది. సెబీ క్లీన్‌చిట్ ఇవ్వడంపై అదానీ ఎక్స్ వేదికగా స్పందించారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలు అవాస్తవమని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, తప్పుడు వాదనలు ప్రచారం చేసిన వారు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.