24 April, 2026 | 2:44 PM

Breaking News

డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి   •   బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి   •   ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి   •   ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపిన బీఎస్పీ నాయకులు   •   ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం   •   మండేపల్లిలో చలివేంద్రం ప్రారంభం – ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన   •   డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   శంకర్‌ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ఆర్టీసీలో ఉద్యోగం: నర్సంపేట ఆర్‌డీఓ   •   సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చలు.. RTC కార్మికుల 3 ప్రధాన డిమాండ్లు ఇవే   •   తిరుమల శ్రీవారికి భారీగా బంగారం విరాళం   •  

3.38 కిలోల బంగారం స్మగ్లింగ్!

19-09-2025 12:36 AM
  1. ఇస్త్రీపెట్టెలో పెట్టి రవాణా
  2. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుకున్న అధికారులు
  3. ముగ్గురు నిందితుల అరెస్టు
  4. బంగారం విలువ 3.36 కోట్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న 3.38 కిలోల బంగారాన్ని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇస్త్రీపెట్టెలో తరలించేందుకు నిందితులు ప్రయత్నం చేయ గా.. అధికారులు పసిగట్టి పట్టుకున్నారు. బంగారంతోపాటు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకున్నట్లు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బంగారం రవాణాకు సంబంధించి ఎలాంటి ధ్రువపత్రాలు లేవని అధికారులు తేల్చారు. పట్టుబ డిన బంగారం విలువు దాదాపు రూ.3.36 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా బంగారం ధర ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తక్కువ ధరకు లంభించే దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసి.. ఇక్కడ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది.