3 April, 2026 | 3:24 PM

Breaking News

మార్పు రావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి.. జీవన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •  

యూఎస్ సుంకాలు తగ్గే చాన్స్!

19-09-2025 01:20 AM

నవంబర్ 30 తర్వాత అగ్రరాజ్యం నిర్ణయం తీసుకునే అవకాశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: అమెరికా విధించిన 50 శాతం సుంకాలు నవంబర్ 30 తర్వాత తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వెంకట్రామన్ అనంత నాగేశ్వరన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాతో వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం అయిన నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పరిస్థితులను గమనిస్తే నవంబర్ 30 తర్వాత సుంకాల భారం తగ్గొచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. కోల్‌కతాలో నిర్వహించిన మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యక్రమంలో అనంత నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని క్లారిటీనిచ్చారు. అమెరికా విధించిన అదనపు సుంకాలకు రష్యా చమురు కారణం కాదని తాను భావిస్తున్నట్టు తెలిపారు.