08-09-2025 12:22:14 AM
మంగపేట, సెప్టెంబరు7 (విజయక్రాంతి): సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి, చెంచులక్ష్మి,ఆదిలక్ష్మి అమ్మవార్ల ఉపాలయాలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ అర్చకులు ద్వారా బంధనం చేశారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ కార్యక్రమానంతరం ఆలయంలో స్వామివారికి అర్చనలు అభిషేకాలు యధావిధిగా కొనసాగుతాయి.