19 May, 2026 | 9:38 AM

పీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

08-09-2025 12:24 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,సెప్టెంబర్7(విజయక్రాంతి): దేశంలో జీఎస్టీ  సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి  వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్ రావు , పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యదవ్ ఆదివారం  క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా వారు పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా దీపావళి కానుకగా కేంద్రం జీఎస్టీపై సంస్కరణలు తీసుకురావడం

హర్షించదగినవిషయన్నారు. రైతు ల నుంచి వ్యాపారుల దాకా ఇళ్ల నుండి కంపెనీల దాకా అందరికీ లభదేకాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సుంకరి పెంటన్న , సీనియర్ న్యాయవాది  దీపక్ రావ్, రాపర్తి పొశన్న, రుకుమ్ ప్రహాలద్, రేవతి,  రేణుక, సత్యనారాయణ, మురళీ గౌడ్, కేశవరావ్, సందీప్ కుమార్, మాటురి జయరాజ్, వెంకటేశ్, కోటేష్, లచ్చన్న, ప్రసాద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.