19-11-2025 06:07:00 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): చింతకుంటలోని శాంతినగర్ లో గల ముదిరాజ్ కులానికి చెందిన రామకృష్ణకు ముప్పై వేలు చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అప్పుల పాలై ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వపరంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారని ఆపదలో ఉన్నవారికి ఈ పథకం ఉపయోగపడుతుందని, సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నమని అన్నారు.