14 July, 2026 | 11:19 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

బాధితులకు అండదండగా సీఎంఆర్ఎఫ్

13-10-2025 06:45 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): బాధితులకు అండదండగా సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందుతున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్ తెలిపారు. సోమవారం బోయినపల్లి మండలం జగ్గారావు పల్లిలో ఐదుగురు బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనారోగ్యానికి గురైన బాధితులు ప్రమాదాల్లో గాయపడిన వారు ఎవరు ఆందోళనకు గురి కావద్దని బాధితులకు ప్రభుత్వం బాసర ఉంటుందని ఆయన చెప్పారు. చికిత్స అనంతరం అందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆన్ లైన్ చేసి ఫైల్ పంపిస్తే ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లారెడ్డి, మండల గ్రామ నాయకులు ఉన్నారు.