13 April, 2026 | 1:48 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

అనుమతి పత్రాలు లేవని ప్రభుత్వ శాఖల పేర్లు చెప్పి వసూళ్లు

16-10-2025 10:46 PM

వ్యక్తిని పట్టుకొని రిమాండ్ కు తరలించిన మేడిపల్లి పోలీసులు

మేడిపల్లి (విజయక్రాంతి): ప్రైవేటు హాస్పిటల్స్, స్కూల్ ల సంబంధించిన అనుమతి పత్రాలు ఎన్ఓసీలు సరిగ్గా లేవనని అపరిచిత వ్యక్తి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉప్పల్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ఆద్వర్యంలో మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి అతనిని అరెస్టు రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లికి చెందిన వ్యక్తి మహమ్మద్ జుల్కర్ నాయన్(36) తండ్రి మహమ్మద్ ఓజియార్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచవాణి సింగారం మణిదీప కాలనీలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. అతను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు జిహెచ్ఎంసి, డిఎంహెచ్ఓ, ఫైర్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి వచ్చానని ఆసుపత్రులు, విద్యాసంస్థల అనుమతి పత్రాలు సరిగ్గా లేవని, ఎన్ఓసీలు లేదని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు నిర్దారణ అయిందని, అతనిపై అనేక పోలీస్ స్టేషన్లో వివిధ కేసులు నమోదు అయ్యాయని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.