1 August, 2026 | 6:59 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

అనుమతి పత్రాలు లేవని ప్రభుత్వ శాఖల పేర్లు చెప్పి వసూళ్లు

16-10-2025 10:46 PM

వ్యక్తిని పట్టుకొని రిమాండ్ కు తరలించిన మేడిపల్లి పోలీసులు

మేడిపల్లి (విజయక్రాంతి): ప్రైవేటు హాస్పిటల్స్, స్కూల్ ల సంబంధించిన అనుమతి పత్రాలు ఎన్ఓసీలు సరిగ్గా లేవనని అపరిచిత వ్యక్తి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉప్పల్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ఆద్వర్యంలో మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి అతనిని అరెస్టు రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లికి చెందిన వ్యక్తి మహమ్మద్ జుల్కర్ నాయన్(36) తండ్రి మహమ్మద్ ఓజియార్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచవాణి సింగారం మణిదీప కాలనీలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. అతను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు జిహెచ్ఎంసి, డిఎంహెచ్ఓ, ఫైర్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి వచ్చానని ఆసుపత్రులు, విద్యాసంస్థల అనుమతి పత్రాలు సరిగ్గా లేవని, ఎన్ఓసీలు లేదని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు నిర్దారణ అయిందని, అతనిపై అనేక పోలీస్ స్టేషన్లో వివిధ కేసులు నమోదు అయ్యాయని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.