13 April, 2026 | 12:12 PM

Breaking News

వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •  

8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఎఫ్ఓ

16-10-2025 10:49 PM

ఫైర్ ఆఫీసులో దీపావళికి ముందే పేలిన టపాసులు..

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి ఏసిబి డిఎస్పి..

నల్గొండ క్రైమ్: 8 వేల లంచం తీసుకుంటూ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కార్యాలయంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎ. సత్యనారాయణ రెడ్డి గురువారం ఏసీబీకి రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డారు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపు ఏర్పాటు చేయడానికి షాపు నిర్వాహకుడు ఎన్ఓసి అడిగారు. ఎన్ఓసి ఇచ్చేందుకు 10 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డికి రూ.8వేలకు లంచం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొని ఎన్జీ కాలేజీలో కలిసి మాట్లాడిన తర్వాత బైక్ ట్యాంక్ కవర్లో 8 వేలు పెట్టాడు.

ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జిల్లా ఫైర్ అధికారి సందేశ్ కుమార్ కి సమాచారం ఇచ్చారు. శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని, నివాసంలో సోదాలు నిర్వహిస్తామని ఏసిబి డిఎస్పి జగదీష్ చందన్ తెలిపారు. అధికారులు ఎవరైనా తన విధులు నిర్వహించకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, ట్విట్టర్,ఫేస్బుక్ నేరుగా ఫిర్యాదు చేసిన వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.