23 March, 2026 | 5:39 PM

Breaking News

మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో మరో విషాదం   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్   •   పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి   •   రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్.. అంకెల గారడి బడ్జెట్   •   ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి   •   కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి   •   ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం   •   అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం   •   విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి ప్రమాదబీమా చెక్కులు పంపిణీ   •  

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

17-07-2025 10:17 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర ఆశ్రమ పాఠశాలను గురువారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టడీ అవర్ లో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ విద్యా బోధన తీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ పరిసరాలు, డైనింగ్ హాల్, స్టడీ రూమ్, మరుగుదొడ్లలను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వసతి గృహంలో పరిశుభ్రత పాటిస్తూ, నిత్యం శానిటేషన్ చెయ్యాలని, షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.