27 June, 2026 | 7:45 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

జిల్లా ప్రధాన ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

20-05-2025 03:44 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ, యూరాలజీ, జనరల్ వార్డ్, హాస్పటల్ ఇన్ పేషెంట్, ఔట్ పేషంట్ వార్డులను పరిశీలించారు. డాక్టర్స్, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న పేషెంట్లకు అందిస్తున్న సేవల వివరాలు సుపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ఆర్ఎంఓ డాక్టర్ జగదీష్ లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలు అందించాలని, హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సదరం క్యాంపు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో అనువైన ప్రదేశంలో వారి కి సేవలు అందించడానికి యుఐడి (బ్లాక్) నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. స్పెషలైజేషన్ మానసిక, కంటి, చెవి, ముక్కు, దంతాలు, వినికిడి లోపం ఉన్న వారిని పరీక్షించేందుకు తగిన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా నాణ్యమైన, స్వచ్ఛమైన పదార్థాలను ఉంచాలని సూచించారు.ఆస్పత్రిలో పార్కింగ్, వైద్య విభాగాలు , సానిటేషన్ నిర్వహణ తదితర అంశాలపై సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిఈ, ఏఈ,  శంకర్, సంబంధిత విభాగాల సిబ్బంది ఉన్నారు.