28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం కోట గుళ్ళు

20-05-2025 05:54 PM

ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి..

మహబూబాబాద్ (విజయక్రాంతి): కాకతీయులు నిర్మించిన కోట గుళ్ళు ఆలయం అద్భుత శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయని రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి(State ACB Director Tarun Joshi) అన్నారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం, కోట గుళ్ళను సందర్శించారు. ఈ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషికి ఘన స్వాగతం పలికారు. మొదట గణపతి, నందీశ్వర గణపేశ్వర స్వాములకు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో శిల్పాలను, గోపురాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రామప్ప శిల్ప సంపదని పోలిన విధంగానే కోటగుళ్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. కోటేశ్వరాలయం, నంది మండపం, నాట్య మండపాల్లో శిల్పకళా నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డారు. ఏసీబీ డైరెక్టర్ వెంట చిట్యాల, భూపాలపల్లి సిఐలు మల్లేష్, నరేష్ కుమార్ గౌడ్, గణపురం ఎస్ఐ రేఖ అశోక్ తదితరులు ఉన్నారు.