17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పరిశ్రమ భద్రతపై కలెక్టర్ సమీక్ష

24-11-2025 10:30 PM

అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో భార జల కర్మాగారం ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీపై సోమవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పటేల్ కీలక సూచనలు చేశారు. కర్మాగారంలో సంభవించే విషవాయువు లీకేజీ వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్ నిర్వహించడం యాజమాన్యం తీసుకున్న మంచి చర్య అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్మాగారం పరిసర గ్రామాల ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో జరగబోయే ప్రమాదాలు, వాటి నివారణ మార్గాలపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ జోన్ పరిధిలోని గ్రామాల్లో మంచినీరు, రహదారి నిర్మాణం, విద్యా సదుపాయాలు, సేఫ్టీ షెల్టర్లు వంటి అత్యవసర మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల భద్రతా చర్యలపై సూచనలు అందించారు.