24-11-2025 08:30:21 PM
గోదావరిఖని (విజయక్రాంతి): గోదావరిఖనిలో ఇటీవల మరణించిన టీవీఎస్ షోరూమ్ యాజమాని వాసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ పరామర్శించారు. మృతుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి వెంట సీనియర్ అడ్వకేట్ చందుపట్ల రమణ కుమార్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.