27-01-2026 12:00:00 AM
ఖమ్మం టౌన్, జనవరి 26 (విజయ క్రాంతి): 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో, విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన అదనపు పౌరసంబంధాల అధికారి ఎండి. అయూబ్ ఖాన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నుండి సోమవారం ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తన బాధ్యత ఈ అవార్డు తో ఇంకా పెరిగిందని, మున్ముందు కూడా నిబద్దత తో పనిచేస్తానని తెలిపారు.