30 June, 2026 | 10:21 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కమర్షియల్ షాపులకు అద్దె కడ్తలేరు

17-07-2025 10:44 PM

అద్దె చెల్లించకుంటే ఇతరులకు కేటాయిస్తాం: ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి

చేవెళ్ల: ప్రభుత్వం వెనుకబడిన తరగతులను దృష్టిలో ఉంచుకొని మండల కేంద్రాల్లో ఎస్సీ కార్పొరేషన్ దుకాణాల సముదాయం నిర్మించి అద్దె ఒప్పందంతో లబ్ధిదారులకు ఇచ్చింది. లబ్ధిదారులు ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వానికి అద్దె చెల్లించకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి రంగంలోకి దిగారు.  గురువారం చేవెళ్ల మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ దుకాణం సముదాయాన్ని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి 5 దుకాణల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు.

5 దుకాణాల గాను విట్టలయ్య రూ.19000, గంగి యాదయ్య రూ.41,000, రామస్వామి రూ.50,000, ఈశ్వరయ్య రూ.34000, యాదయ్య రూ.44000 అద్దెలు బకాయిలు ఉన్నాయని అద్దె వెంటనే చెల్లించాలని తెలిపారు.  ప్రతినెల ఒక దుకాణానికి రూ.500 చొప్పున ప్రభుత్వానికి అద్దె చెల్లించాల్సి ఉండగా లబ్ధిదారులు చెల్లించడం లేదని చేశారు. చెల్లించాలని నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈనెలాఖరులోగా అద్దెలు చెల్లించకపోతే అద్దె ఒప్పందం రద్దు చేసి మరొకరికి కేటాయిస్తామని పద్మావతి హెచ్చరించారు. నెలకు రూ.500 చెల్లించకపోవడం ఏంటని ఈడి అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దుకాణాలు దక్కించుకున్న లబ్ధిదారులు వారే నిర్వహించుకోకుండా ఇతరులకు అద్దెకివ్వడం చట్ట విరుద్ధమన్నారు.