16 April, 2026 | 8:13 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు

09-05-2025 01:22 AM

-జిల్లా ఆదనపు కలెక్టర్ డేవిడ్

కుమ్రం భీం ఆసిఫాబాద్,మే 8(విజయ క్రాంతి):ప్రభుత్వం భూ సమస్యల పరిష్కార కోసం నిర్వ-హిస్తున్న రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని జిల్లా అద-నపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ అన్నారు.

గురువారం జిల్లాలో పైలెట్ మండలం గా ఎంపికైన పెంచికల్ పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సును సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలు ఉన్న రైతులు  దరఖాస్తులను సమర్పించాలని, ఈ దరఖాస్తుల వివరాలను నమోదు చేసుకుని తక్షణమే పరిష్క-రించే దిశగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కవిత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.