09-05-2025 01:23:28 AM
మెదక్ ఎంపీ రఘునందన్రావు ఓ పత్రిక తప్పుడు కథనాలపై ఎస్పీకి ఫిర్యాదు
మెదక్, మే 8 (విజయక్రాంతి) : దేశ ప్రతిష్టతకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్రావు హెచ్చరించారు. ఓ తెలుగు పత్రికలో మన దేశ యుద్ద విమానాలను పాకిస్తాన్ ఆర్మీ కూల్చి వేసిందని తప్పుడు కథనాలను రాసిన పత్రిక ఎడిటర్, యాజమాన్యం మీద కేసు నమోదు చేయాలని ఎస్పీకి తన లెటర్ ప్యాడ్ ద్వారా జిల్లా నాయకులచే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును బిజెపి మెదక్ జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్, కాశీనాథ్, రమేష్ గౌడ్, నాయిని ప్రసాద్, సతీష్, శివ ఉన్నారు.