9 May, 2026 | 10:25 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి

17-09-2025 06:39 PM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

తంగళ్ళపల్లి,(విజయశాంతి): జిల్లాలో త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలో మొత్తం 57 ఇండ్ల నిర్మాణానికి మార్క్ ఔట్ చేశారు. బేస్మెంట్ లెవెల్ లో 10, గోడల దశలో 10, స్లాబ్ దశలో 20 ఉన్నాయని, 17 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్ దృష్టికి ఎంపీడీఓ లక్ష్మీనారాయణ తీసుకెళ్లారు.

గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయిస్తున్న పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ అభినందించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకొని రానున్న పండుగకు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.