28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

రైతుల కోసం మోహన్ రెడ్డి చేసిన సేవలు మరవలేనిది

17-09-2025 06:44 PM

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని ఎదుర్లగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్ఈ దివంగత గూడూరు మోహన్ రెడ్డి రైతుల కోసం చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సంగెం భీమ లింగం సమీపంలోని  శ్రీ వెంకటేశ్వర ఎత్తిపోతల పధకం వద్ద కీ.శే.గూడురు మోహన్ రెడ్డి  విగ్రహాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీ వెంకటేశ్వర ఎత్తిపోతల పథకం మంజూరు చేయించేందుకు మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటిని అందించేందుకు ఎంతో తోడ్పాటు అందించాలని అన్నారు.