1 July, 2026 | 7:10 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

ఫారెస్ట్ గ్రౌండ్‌ను మున్సిపాలిటీకి అప్పగించండి

17-07-2025 10:08 PM

ఇల్లందు,(విజయక్రాంతి): పట్టణంలోని ఫారెస్ట్ గ్రౌండ్‌ను మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు భవనాల నిర్మాణం కోసం కేటాయించడాన్ని రద్దు చేసి, ఆ స్థలాన్ని క్రీడా మైదానంగా మార్చి ఇల్లందు మున్సిపాలిటీకి అప్పగించాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ గురువారం తెలంగాణ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) కు వినతిపత్రం అందజేశారు. ఇల్లందు మున్సిపల్ కోర్టుకు సమీపంలో ఉన్న ఫారెస్ట్ గ్రౌండ్‌ను గతంలో క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ట్రాక్ వంటి వివిధ క్రీడలలో శిక్షణ కోసం అథ్లెట్లు ఉపయోగించేవారని, దసరా జమ్మి పూజకు సాంప్రదాయకంగా ఉపయోగించే ప్రక్కనే ఉన్న జమ్మి మైదానాన్ని చర్చి నిర్మాణం కోసం సిఎస్ఐ చర్చినీ నిర్మించారన్నారు.

కొత్త కోర్టు భవనాల కోసం ఫారెస్ట్ గ్రౌండ్ కేటాయించబడినప్పటికీ, అదనపు కోర్టును తర్వాత రద్దు చేశారని, ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం సరిపోతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కేటాయించిన క్రీడా మైదానం గత 4 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన, గిరిజనేతర నివాసితుల ప్రయోజనం కోసం ఫారెస్ట్ గ్రౌండ్‌ను క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇల్లందు పట్టణంలోని 8500 ఇండ్ల కు 76 జీవో ద్వారా ఇండ్ల పట్టాలని ఇప్పించాలని, జెకె 5 ఓసి ప్రాంతాన్ని మున్సిపాలిటీకి అప్పగించాలని మంత్రికి తెలియజేశారు.