17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

07-11-2025 01:28 AM

-ఆసిఫాబాద్ జిల్లాలో రూ.75 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఎం నర్సింగరావు 

-రూ.10 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ మరిపెడ మున్సిపల్ ఏఈవో సందీప్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): రైస్‌మిల్ యజమాని వద్ద ఆసిఫాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎం నర్సింగరావు రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రైస్‌మిల్లు నుంచి సీఎంఆర్ బియ్యంను నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి, ధ్రువీకరణ పత్రా లు ఇచ్చేందుకు ఒక్కో లారీకి రూ.25 వేలు లంచం ఇవ్వాలని డీఎం నర్సింగరావు డి మాండ్ చేశాడు. దానికి అంగీకరించిన బాధితుడు ఆ తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు.

ఏసీబీ సూచన మేరకు గురువారం సాయం త్రం రెబ్బెన మండలంలోని కైరుగాం వద్ద బాధితుడు మూడు లారీలకు సంబంధించిన రూ.75 వేలు నర్సింగరావుకు ఇస్తుండ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నర్సింగరావుతోపాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మణికంఠను అదుపులోకి తీసుకొని కార్యాల యంలో అదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు విచారించారు. 

మరిపెడలో 

మరిపెడ(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో గురు వారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నీల్కుర్తి క్లస్టర్ ఏఈ వో సందీప్ రూ.10 వేలు లంచం తీసుకుం టూ పట్టుబడ్డాడు. ఆనేపురం గ్రామానికి చెందిన రైతు గత నెలలో చనిపోగా.. ఆయన పేరున రైతుబీమా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తును నమోదు చేసేందుకు ఏఈవో సందీప్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. మొదటగా రూ.పదివేలు ఇస్తామని ఒప్పందం చేసుకున్న బాధితులు.. ఆ తర్వాత ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచ న మేరకు గురువారం బస్టాండ్ సమీపంలోని జేజే రెస్టారెంట్ ఎదురుగా ఏఈఓ సందీప్‌కు బాధితుడు రూ.10 వేలు ఇస్తుండగా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సాం బయ్య తెలిపారు.