15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పత్తిలో రసం పీల్చే పురుగుల

07-11-2025 01:27 AM

నివారణపై రైతులకు శిక్షణ 

ధర్మపురి,నవంబర్6 (విజయక్రాంతి): తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో వెల్గటూరు మండలం శాఖాపూర్ గ్రామంలో గురువారం పత్తిలో రసం పీల్చే పురు గులపై సమగ్ర సస్యరక్షణ చర్యలు‘ మీద రైతు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సస్యరక్షణ శాస్త్రవేత్త డా.యం. రాజేంద్రప్రసాద్ వాతావరణ సంబంధిత అంశాలను, చీడ పీడల యాజమాన్యంపై రైతులకు వివరించారు.

ముఖ్యంగా పత్తిలో పేనుబంక, తామర పురుగులు తెల్ల దోమ, పిండి నల్లి, గులాబి రంగు పురుగు లక్షణాలు మరియు నివారణ చర్యలు తెలియజేశారు. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడా క్లోప్రిడ్ 0.3మి.లీకు లీటర్ నీటిని లేదా ఎసిటామిప్రిడ్ 0.4 గ్రా.లీ కు లీటర్ నీటిని లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రా.లీ కు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలనీ సూచించారు. జిగురు అట్టలను 20 నుండి 25 వరకు ఎకరానికి పెట్టుకోవాలన్నారు.

ఆకు మచ్చ తెగుళ్ళ నివారణకు ప్రొపికోనజల్ 1మి. లి కు లీటర్ నీటికీ కలుపుకొని పిచికారి చేసుకోవాలన్నారు. కాయకుళ్ళు తెగులు నివారణకు కాపరాక్సి క్లోరైడ్ 3గ్రా.లీ. కు నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలన్నారు. తదనంతరం తెలంగాణ రైతు విజ్ఞాన కోఆర్డినేటర్ డా. హరికృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వివిధ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ పత్తిలో కలుపు యాజమాన్యం పై, పోషక లోపాలపై రైతులకు అవగాహన కల్పించారు.

డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ ధరలకు అనుకూలంగా పంటలను సాగు చేయాలని రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీ. పి. సాయికిరణ్, వ్యవసాయ విస్తరణ అధికారినీ మౌనిక, రైతు సోదరులు పాల్గొన్నారు.