21 April, 2026 | 5:39 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

అవినీతి జలగ.. జీవన్‌లాల్

14-05-2025 12:00 AM
  1. హైదరాబాద్ ఆదాయపు పన్నుల శాఖ కమిషనర్ లీలలు
  2. సీబీఐ దర్యాప్తులో బయటపడుతున్న లంచాల బాగోతం

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ ముంబైలో ఆదివారం సీబీఐకి చిక్కిన హైదరాబాద్ ఆదాయపు పన్నుల శాఖ కమిషనర్ జీవన్‌లాల్ కేసు దర్యాప్తులో అనేక కీలక అంశాలు  బయటపడుతున్నట్లు తెలుస్తోం ది. రెండున్నర కోట్ల విలువైన ఫ్లాట్‌ను ముంబైకి చెందిన ఎన్డీడబ్యూ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి లంచంగా తీసుకున్నట్లు సమాచారం.

ఆ ఫ్లాట్‌ను ఖమ్మం జిల్లాకు చెందిన బినామీ దండెల్ వెంకటేశ్వర్లు పేరిట రిజిష్ర్టేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. హవాలా ద్వారా రూ.35 లక్షల లంచాన్ని ముంబైలోని మరో రెండు సంస్థల నుంచి స్వీకరించినట్లు అధికారుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ట్యాక్సేషన్ ఫైల్ పెండిం గ్‌లో ఉన్నందున దాన్ని క్లియర్ చేసేందుకు షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి రూ.కోటి 20 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు సీబీఐకి సమాచారం అందింది.

రూ.15లక్షల లంచాన్ని ఇద్దరు మధ్యవర్తుల ద్వారా జీవన్‌లాల్  తీసుకోగా, మరో 70లక్షలు తీసుకునే సమయంలో పక్కా ఆధారాలతో సీబీఐ అధికారులు పట్టుకున్నారు. లంచం ఇచ్చిన వారి ని నిందితులుగా చేర్చిన సీబీఐ, ఈ వ్యవహారంలో మొత్తం 15 మందిపై కేసులు నమో దు చేశారు. జీవన్‌లాల్ ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ కొడుకు.