28-07-2025 10:34:20 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సోమవారం సీఐ సురేష్(CI Suresh) రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న పెద్ద నేరాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజల సహకారానికి పొందేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగా రౌడీ శీటర్లను సమీకరించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు శ్రీనివాసరెడ్డి, హసీనా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.