13-08-2025 06:56:38 PM
సిద్దిపేట క్రైమ్: స్వాతంత్ర దిన వేడుకలు నిర్వహించే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఉన్న పరేడ్ గ్రౌండ్ ను పోలీస్ కమిషనర్ బి.అనురాధ(Police Commissioner Anuradha) బుధవారం పరిశీలించారు. వర్షాల దృష్ట్యా వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, పూర్ణచందర్, రాజేష్ పాల్గొన్నారు.