23 June, 2026 | 5:53 AM

సైబర్ వారియర్ కు ప్రశంసాపత్రం అందజేసిన సీపీ

22-09-2025 11:18 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సైబర్ క్రైమ్ బాధితులకు అండగా నిలిచి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండవ స్థానం సాధించిన బెల్లంపల్లి వన్ టౌన్ సైబర్ వారియర్ సంజీవ్ కుమార్ ను సోమవారం రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. సైబర్ క్రైమ్ బాధితులకు అందాల్సిన రికవరీ విషయంలో ప్రత్యేక చొరవతో విధులు నిర్వర్తించిన వారియర్ సంజీవ్ కుమార్ ను బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్, బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ కె. శ్రీనివాస రావు అభినందించారు.