12 June, 2026 | 2:19 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట

18-12-2025 12:16 AM
  1. అనుమతి లేకుండా అక్రమ రవాణాకు పాల్పడితే 

చర్యలు తప్పవు:  తహసీల్దార్ శ్రీకాంత్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి)డిసెంబర్17: అనుమతి లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ హెచ్చరించారు. బుధవారం మూసి పరివాహక ప్రాంతమైన జాజిరెడ్డిగూడెం గ్రామంలోని గంగదేవమ్మ ఆలయ ప్రాంగణంలో గల బతుకమ్మ కుంట వద్ద ఇసుక అక్రమ రవాణాను నివారించడానికి రెవెన్యూ సిబ్బంది తగు చర్యలు తీసుకుంది.

ఈ సందర్భంగా బతుకమ్మ కుంట వద్ద జెసీబీలతో కందకం తవ్వి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే ట్రాక్టర్లను సీజ్ చేసి ఓనర్, డ్రైవర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. కార్యక్రమంలో గిర్థవార్ జలంధర్ రావు ,పంచాయతీ కార్యదర్శి,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.