11 May, 2026 | 1:28 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు

07-08-2025 12:53 AM

మంచిర్యాల, ఆగస్టు 6 (విజయక్రాంతి) : జిల్లాలో ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించిన రెండు రైస్ మిల్లుల యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య బుధ వారం తెలిపారు.

హాజీపూర్ మండలం నర్సింగాపూర్‌లోని  శ్రీసాయి మణికంఠ ట్రేడర్స్‌లో 4,108 మెట్రిక్ టన్నులు, నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీరాజ రాజేశ్వరి ట్రేడర్స్ లో 8,578 ప్రభుత్వం ధాన్యం లేకపోవడంతో మిల్లు యజమానులపై హాజీపూర్ పోలీస్ స్టేషన్ లలో వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం ధాన్యంను పక్కదారి పట్టించిన 17 రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని, రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఆ మిల్లుల నుంచి ప్రభుత్వ బాకీని వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు.