9 April, 2026 | 10:41 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

పంట రుణాలు ఇవ్వాలి

13-10-2025 06:39 PM

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్..

కాటారం (విజయక్రాంతి): అటవీ పట్టాలు పొందిన రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున యూనియన్ బ్యాంక్ మేనేజర్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కి అటవీ పట్టాలు పొందిన రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసి రైతులు అటవీ పట్టాలు పొంది ఉన్నప్పటికీ బ్యాంకుల నుండి ఎలాంటి పంట రుణాలు కల్పించకపోవడంతో ఆదివాసి రైతులు చేసిన పంటను రక్షించుకోవడానికి ప్రైవేటు గడ్డి వ్యాపారస్తుల వద్ద, మైక్రో ఫైనాన్స్ వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని ఆరుగాలం కష్టపడి పండించిన పంట మొత్తం తీసుకున్న అప్పు తీర్చడానికి సరిపోవటం లేదని అదేవిధంగా ఫెర్టిలైజర్స్ షాపులలో ఉద్దెర ఖాతాలు పెట్టి మందులు తీసుకొని మోసపోతున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అటవీ పట్టాలకు పంట రుణాలు ఇస్తావుంటే ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవ్వక పోవడం ఈ దుస్థితికి కారణం ఎవరు అని ప్రశ్నించారు అప్పుల ఊబిలో కోరుకుంటున్న రైతులను కాపాడాల్సిన కనీస బాధ్యతను కూడా అధికారులు ఇక్కడి పాలకులకు లేకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన పోరాటాలకు పూనుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు దమ్మూర్ మాజీ ఉప సర్పంచ్ మడే సత్యనారాయణ తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్ది, శేఖర్, రామినేని రాజబాబు, తోలం బిక్షపతి, మేడే సురేష్, జనగామ ముత్తయ్య తదితరులు ఉన్నారు.