16 April, 2026 | 8:15 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలు

15-04-2025 01:16 AM

తలకొండపల్లి,ఎప్రిల్ 14: తలకొండపల్లి మండలం లోని ఆయా గ్రామాలలో సోమవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వర్షానికి వివిద రకాల పంటలు దెబ్బతిన్నాయి.చంద్రధన,రాంపూర్ గ్రామాలలో భారీవర్షంతో పాటు వడగళ్ల వాన కురుసింది.ఈ వర్షానికి వరి,మామిడి,కూరగాయ తోటలు బాగా దెబ్బతిన్నాయి.వరి పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్ల వర్షం కురియడంతో పంట నేలరాలి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఈసారి మామిడి కాత అంతంతమాత్రంగానే ఉంది.కాసిన కొద్దిపాటి మామిడికాయలు వడగళ్ల వర్షానికి నెలరాలాయి.కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి.ఈ రెండు గ్రామాలలో పంటల నష్టం అదికంగా ఉంది.మిగతా గ్రామాలలో ఒక మోస్తరు వర్షం కురిసింది.పంటలు దెబ్బతిన్న గ్రామాలలో అదికారులు పర్యటించి పంట నష్టం అంచనాలు వేసి రైతులను ఆదుకోవాలని రైతులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,ప్రభుత్వ అదికారులను కోరుతున్నారు.