16 April, 2026 | 12:07 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

ఫిట్‌నెస్‌కు సైక్లింగ్ ఉత్తమ మార్గం

22-12-2025 12:00 AM

జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి

కొత్తగూడెం, డిసెంబర్ 21: (విజయక్రాంతి)కేంద్ర ప్రభుత్వం, స్పోరట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అమలవుతున్న ఫిట్ ఇండియా మిషన్ కార్యక్రమంలో భాగంగా, స్పోరట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఫిట్ ఇండియా సన్డే సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొత్తగూడెం పట్టణంలో సన్డే సైక్లింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా విజయవంతం చేశారు.సైక్లింగ్ వంటి శారీరక వ్యాయామాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ప్రజల్లో ఫిట్నెస్పు అవగాహన పెంపొందించడం, అలాగే ఫిట్ ఇండియా మిషన్లో భాగంగా సైక్లింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ నరేష్, సైక్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ బీవీజీ కృష్ణ, నాగేశ్వర్ రావు, ఉదయ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు కవిత, శైలజ, కాంచనపల్లి స్పోరట్స్ స్కూల్ హెడ్మాస్టర్, తదితరులు పాల్గొన్నారని తెలిపారు.