15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉమ్మడి జిల్లా స్థాయి చదరంగ పోటీకి ఎంపికైన దాసోహం ఆరాధ్య

15-10-2025 12:09 AM

సుల్తానాబాద్, అక్టోబర్14 (విజయ క్రాంతి) :  ఉమ్మడి జిల్లాస్థాయి చదరంగ పోటీలలో ఎంపికైన సుల్తానాబాద్ సెయింట్ మేరీస్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని దాసోహం ఆరాధ్య. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 11న జరిగినటువంటి ఎస్ జి ఎఫ్ అండర్ 14, అండర్ 17 చదరంగ పోటీలలో జిల్లాలోని పలు మండలాల విద్యార్థిని, విద్యా ర్థులు పాల్గొనగా అండర్ 14 విభాగంలో ప్రతిభ కనబరిచి రెండవ స్థానంలో సిల్వర్ మెడల్ పొంది, ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనందుకు విద్యార్థిని ఆరాధ్య ను పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ కాసు షో రెడ్డి మంగళవారం  అభినందించారు, ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యా ర్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని, చదరంగం క్రీడతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, పట్టుదల పెరిగి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తారని అన్నారు.