1 July, 2026 | 6:38 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

ఘనంగా శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు

13-04-2025 08:55 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): అజాత శత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. అనంతరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహదేపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, మాజీ ఎంపీపీ రాణి బాయి, మాజీ జెడ్పిటిసి అరుణ, మాజీ కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ వామన్ రావు, మంతిని డివిజన్ యూత్ అధ్యక్షులు విలాస్ రావు, మండల యూత్ అధ్యక్షులు కటకం అశోక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.