04-10-2025 04:48:39 PM
చిట్యాల,(విజయక్రాంతి): మాజీ నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ వేమవరం ప్రసన్నా రత్నాకర్ బాబురావు వర్ధంతి వేడుకలను శనివారం వారి కుమారుడు వేముల సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. రామన్నపేట మండలం జానంపల్లి గ్రామంలో వేమవరం ప్రసన్నా రత్నాకర్ బాబురావు 22 వ వర్ధంతి సందర్భంగా జానంపల్లి గ్రామంలో వారి కుమారుడు మాజీ ఎంపీటీసీ వేమవరం సుధీర్ బాబు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించి వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి యొక్క సేవలను గుర్తు చేసుకొనీ, వారి యొక్క ఆశయ సాధనకు నిరంతరం పనిచేస్తానని తెలిపారు.