6 June, 2026 | 8:26 PM

Breaking News

అధ్యాపకులు మనసుపెట్టి భోదించాలి: ఎన్ఆర్ఐ గోపాల్ టీకే కృష్ణ   •   పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ అభివృద్ధి పనులకు శ్రీకారం   •   అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   రైతుల వడ్లు రక్షించిన పోలీసులు   •   మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో రెండో రోజు ప్రత్యేక వార్డుల సభ   •   ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ అభ్యర్ధులకు సర్టిఫికెట్లు అందజేసిన జివి కిరణ్ కుమార్   •   దమ్మపేట పంచాయతీలో గ్రామసభ   •   టేకులపల్లిలో విత్తన దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి   •   రోడ్డు ప్రమాదంలో 30 గొర్రెల మృతి   •  

ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా దీటి బాలనర్సు

07-01-2026 12:00 AM

బెజ్జంకి జనవరి 6: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల ఉప సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులు గా దాచారం గ్రామ ఉప సర్పంచ్ దీటీ బాల నర్సు ను మండల కేంద్రంలో  బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా జెట్టి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు  రాజిరెడ్డి ,పుల్ల అనిత భీరయ్య,బుర్ర వినోద్,ప్రధాన కార్యదర్శి ఆడుకుని వీరేశం,సహాయ కార్యదర్శి గైనీ త్రిశూల్,సంయుక్త కార్యదర్శి టేకు జ్యోతి సంపత్, కోశాధికారి నాంపల్లి శంకర్,కార్యవర్గ సభ్యులు చాడగొండ పుష్పలత శ్రీనివాస్ రెడ్డి , గంగాధర రాజమల్లు లను  ఎన్నుకున్నారు.

మండల ఫోరం అధ్యక్షుడిని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శాలువా కప్పి అభినందించారు.అంతరం బాల నర్సు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి  ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికీ కృతజ్ఞతలు తెలిపారు. తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరితో  కలసి మండల అభివృద్ధిలో ముందుకు సాగుతానని ఆయన తెలిపారు.