30 June, 2026 | 11:51 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

గ్రూప్-1 విజేతలు కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు..

27-09-2025 07:13 PM

హైదరాబాద్: గత ప్రభుత్వం పదేళ్లుగా గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వలేదని.. కేసీఆర్ ప్రభుత్వం తన కుటుంబం గురించే ఆలోచించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన గ్రూప్-1 అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని అన్నారు. టీజీపీఎస్సీకి నిధుల అంశంలో రాజీపడొద్దని సీఎం ఎన్నోసార్లు నాకు చెప్పారని.. కూలీలు, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు కూడా గ్రూప్-1 సాధించారని తెలిపారు. రాష్ట్రంలోని వనరులన్నింటినీ సమానంగా పంచాలనేదే మా సంకల్పమని, గ్రూప్-1 విజేతలు కొత్త జీవితం ప్రారంభించబోతున్నారని అన్నారు. రాబోయే 30-35 ఏళ్లు రాష్ట్ర ప్రగతిలో మీరు కీలకపాత్ర పోషించబోతున్నారని.. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు.